నేడు జేసీగా ప్రసన్నవెంకటేష్‌ బాధ్యతల స్వీకరణ

10 May, 2017 00:28 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌):  జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇంతవరకు  కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను ప్రభుత్వం జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన తొలుత పాడేరు సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. జాయింట్‌ కలెక్టర్‌గా ఆయనకు ఇది మొదటి పోస్టింగ్‌. కర్నూలు జేసీగా ఆయన  ఎన్ని గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత లేదు.  
మరిన్ని వార్తలు