గ్రామాల అభివృద్ధి

4 Sep, 2016 23:11 IST|Sakshi
 
అచ్చంపేట: పట్టణంలో రూ.కోటి నిధులతో సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడుతున్నామని నగరపంచాయతీ చైర్మన్‌ కె.తులసీరాం అన్నారు. ఆదివారం ఎస్టీ హాస్టల్‌ పక్కన  మురుగు కాల్వ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇప్పటికే పట్టణంలో పనులు ప్రారంభమైందని, మరో కోటి నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ఎమ్మెల్యే సహాకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని,పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో వైఎస్‌ చైర్మన్‌ బంధం రాజు, మాజీ జెడ్పీటీసీ పి.మనోహర్, సర్పంచ్‌ల సంఘం తాలుకా అ«ధ్యక్షుడు ఎడ్ల నర్సింహగౌడ్, కౌన్సిలర్లు జయరఘరాం,హన్మంత్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు జి.రాజేందర్‌ పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు