వైఎస్‌ హయాంలోనే సంక్షేమ పథకాలు

11 Sep, 2016 00:16 IST|Sakshi
వైఎస్‌ హయాంలోనే సంక్షేమ పథకాలు
  • ∙ఐలమ్మ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
  • ∙వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌
  • పాలకుర్తి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలోనే సంక్షేమ పథకాల ఫలితాలు పేదలకు చేరాయని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ అన్నారు. శని వారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన బడుగు వర్గానికి చెందిన అయిలమ్మ మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
     
    తెలంగాణ ఉద్య మ సమయంలో పోరాటయోధులకు సముచిత స్థానం కల్పించి, అధికారికంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తానని కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిరోజు జిల్లా కేంద్రాలు, డివిజన్‌ కేంద్రాల్లో నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజల అభీష్టానికి అనుకూలంగా పర్యటిస్తున్న కోదండరాంను ప్రభుత్వం నిర్బందించే విధంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు.  
     
    సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కందాడి అచ్చిరెడ్డి, జిల్లా నాయకులు సాయికుమార్, గూడ సుమన్, మండల నాయకులు నీలం లక్ష్మయ్య, మాడరాజు యాకయ్య, చింతకింది శ్రీహరి, గుగులోతు యాకయ్య, మారపెల్లి ఎల్లయ్య, చిది రాల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు