విద్యుదాఘాతంతో మహిళ మృతి
విద్యుత్, మహిళ, మృతి
electrical, women, died
women died with electrick shok
పార్వతీపురం (ప్రత్తిపాడు): విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని పార్వతీపురానికి చెందిన కామినేని సుమితి (25) సోమవారం సాయంత్రం ట్యాంకుకు నీటిని ఎక్కించుకునేందుకు మోటార్ ప్లగ్ను కరెంటు బోర్డులో గుచ్చుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్షాక్కు గురై అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు ఎస్ఐ ఏ బాలకష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈమెకు భర్త పిల్లలు ఉన్నారు.