టిడిపి రెబల్ అభ్యర్థిపై దాడి

6 May, 2014 20:00 IST|Sakshi

గుంటూరు: గుంటూరు తూర్పు శాసనసభ నియోజకవర్గం  టీడీపీ రెబల్ అభ్యర్థి అల్లా బక్ష్‌పై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో అల్లా బక్ష్‌  తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు వెనక నుంచి వచ్చి దాడి చేసి పరారయ్యారు. గాయపడిన అల్లా బక్ష్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుండగులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఈ నియోజకవర్గంలో టిడిపి తరపున మద్దాల గిరిధర్ పోటీలో ఉన్నారు. అల్లా బక్ష్‌ టిడిపి టికెట్ తనకే లభిస్తుందని ఆశించారు. తనకు రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరపున ముస్తఫా పోటీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు