'అక్కడక్కడా ఉద్రిక్తత, దాడులు జరగలేదు'

7 May, 2014 14:41 IST|Sakshi

హైదరాబాద్ : సీమాంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అక్కడక్కడా ఉద్రిక్తత నెలకొన్నా, దాడులు జరగలేదని అన్నారు. పోలింగ్లో ఎక్కడా అంతరాయం జరగలేదని,  అన్ని ఈవీఎంలు పని చేస్తున్నాయని భన్వర్ లాల్ తెలిపారు.  మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 54 శాతం పోలింగ్ నమోదు అయనట్లు తెలిపారు. క్రమంగా పోలింగ్ శాతం పెరుగుతోందని ఆయన చెప్పారు.

 

మరిన్ని వార్తలు