వారణాశికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు

9 May, 2014 20:55 IST|Sakshi

లక్నో: కేంద్ర ఎన్నికల సంఘం వారణాశి లోక్సభ నియోజవర్గానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది. తమిళనాడు కేడర్కు చెందిన ప్రవీణ్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది.

వారణాశి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మే 12న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు