టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ పార్టీ: జైరాం

18 Apr, 2014 13:13 IST|Sakshi
టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ పార్టీ: జైరాం

హైదరాబాద్ : టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో వస్తేనే శాంతియుత పరిస్థితులు ఉంటాయని కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆయన శుక్రవారం ఇందిరా భవన్లో విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా జైరాం రమేష్ టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ పార్టీ అని, ప్రజలను రెచ్చగొట్టడం, వివాదాలు సృష్టించడం ఆ పార్టీ ఎజెండా అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి పలు హామీలు విభజన చట్టంలోనే ఉన్నాయని జైరాం రమేష్ తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయాల్సిందేనన్నారు.
 

మరిన్ని వార్తలు