పెదవులు మృదువుగా...

29 Jan, 2020 01:03 IST|Sakshi

►పెదవులు పొడిబారుతుంటే... కీరదోస ముక్కతో ఐదు నిమిషాల సేపు పెదవుల మీద వలయాకారంగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మూడు లేదా నాలుగు రోజుల్లోనే పెదవులు మృదువుగా మారతాయి.

►టేబుల్‌ స్పూన్‌ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్‌.

►టీ స్పూన్‌ పెరుగు, అర టీ స్పూన్‌ ఆరెంజ్‌ జ్యూస్‌ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్‌ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది.
 

మరిన్ని వార్తలు