పులి పిల్లల్లో ఎక్కువగా రెండేళ్లలోపే చనిపోతుంటాయి

30 Jun, 2013 02:28 IST|Sakshi
 రెండేళ్ల వయసు వచ్చే వరకూ తన పిల్లలను ఆడపులి సంరక్షిస్తుంది.
 
 పులి పిల్లల్లో ఎక్కువగా రెండేళ్లలోపే చనిపోతుంటాయి. 
 
 పులుల గుంపును ‘అంబుష్’ లేదా ‘స్ట్రీక్’ అంటారు.
 
 పులులు రాత్రిపూట వేటాడడానికే ప్రాధాన్యం ఇస్తాయి.
 
 పులులు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఒకే ఉదుటున ఐదుమీటర్ల దూరం దూకగలవు.
 
 ఇండియా, బంగ్లాదేశ్, నార్త్‌కొరియా, సౌత్‌కొరియా, మలేసియా దేశాలు పులిని జాతీయ జంతువుగా గౌరవించుకుంటున్నాయి. 
 
 పులులు సింహాలతో జతకట్టడంతో టైగన్స్, లైగర్‌లు జన్మిస్తాయి.
 
మరిన్ని వార్తలు