హైదరాబాద్ : సమాచార సేకరణకు వెళ్లిన సాక్షి టీవీ విలేకరిపై ఓ పోలీసు జులుం ప్రదర్శించాడు. మోహదీపట్నం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో విలేకరి దత్తురాజ్పై రైటర్ అలెగ్జాండర్ దాడి చేశాడు. విలేకరిపై అలగ్జాండర్ నాలుగుసార్లు భౌతిక దాడి చేశాడు. ఈ ఘటనపై సీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.