నడిరోడ్డుపై పెట్రోల్‌తో దాడి

12 Dec, 2015 14:26 IST|Sakshi

నగరంలోని షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై దుండగులు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రంగ, భుజంగ థియేటర్ సమీపంలో ఆటో నడుపుతున్న హనుమంతు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం పరారయ్యారు. ఈ ఘటనలో ఆటో దగ్ధం కాగా, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, 108 వాహనం వెంటనే రాకపోవడంతో కాలిన గాయాలతో హనుమంతు పడిన అవస్థలు చూసి స్థానికులు చలించిపోయారు.


 

మరిన్ని వార్తలు