అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు... పోలీసుల దాడులు

22 May, 2016 09:01 IST|Sakshi

హైదరాబాద్ : అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులకు బంజారాహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు. శనివారం అర్ధరాత్రి పలువురు యువకులు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు దిగారు. 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం 25 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సదరు యువకులు తల్లిదండ్రులను స్టేషన్కి పిలిపించి... వారి... సమక్షంలో యువకులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు