అసభ్య ప్రవర్తనతో ఇద్దరిపై కేసు నమోదు

16 Feb, 2015 23:05 IST|Sakshi

హైదరాబాద్ సిటి: ఆడుకుంటున్న బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు..మన్సూరాబాద్ కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఆదివారం రాత్రి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సాయి(23), కళ్యాణ్(22)లు ఈ విషయాన్ని గమనించారు. మాయ మాటలు చెప్పి ఆ బాలికను ఆటోలోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో సోమవారం సాయంత్రం ఆ ఇద్దరు యువకులపై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
(ఎల్బీనగర్)

>
మరిన్ని వార్తలు