కమాండ్ కంట్రోల్ భవనానికి శంకుస్థాపన

22 Nov, 2015 10:58 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ భవనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం ఆయన భూమి పూజ చేశారు.

302 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవాన్ని నిర్మిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు