-

ఖైరతాబాద్లో బారులు తీరిన భక్తులు

20 Sep, 2015 12:45 IST|Sakshi

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. మహానగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలు తరలి వస్తున్నారు. ఇప్పటికే సుమారుగా వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. భక్తులకు దర్శనార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. అదే విధంగా రక్షణ చర్యలు కూడా చేపట్టినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు