డ్యూయల్ డిగ్రీ కోర్సులు కొనసాగింపు

26 Aug, 2015 04:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో 2013లో ప్రవేశపెట్టిన డ్యూయల్ డిగ్రీ, ల్యాటరల్ ఎంట్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో జారీ చేశారు. మేనేజ్‌మెంట్‌లో 5 ఏళ్ల డ్యూయల్ డిగ్రీ, ఐదున్నరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఇంజనీరింగ్-మేనేజ్‌మెంట్, ఫార్మసీ-మేనేజ్‌మెంట్), ఆరున్నరేళ్ల ఆర్కిటెక్చర్ మేనేజ్‌మెంట్ కోర్సులు, రెండేళ్ల ఎంసీఏ, ఎంసీఏలో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ, మూడేళ్ల ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీసీఏ, బీఎస్సీ (ఐటీ/సీఎస్) విద్యార్థులు ఎంసీఏ ద్వితీయ సంవత్సరంలో చేరే తదితర కోర్సులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు.

మరిన్ని వార్తలు