30న గురుకులాల్లో ‘బోధన సిబ్బంది’ పరీక్ష | Sakshi
Sakshi News home page

30న గురుకులాల్లో ‘బోధన సిబ్బంది’ పరీక్ష

Published Wed, Aug 26 2015 4:47 AM

teaching staff exam in tribal residential schools, says rs praveen kumar

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో బోధనా సిబ్బంది ఖాళీలకు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన చేపట్టిన నియామక పరీక్ష ఈ నెల 30 న నిర్వహిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తె లిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 11-1 గంటల మధ్య రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష హాలుకు రావాలని,  నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు. హాల్‌టికెట్లను www.tgtwgurukulam.telangana.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement