పెళ్లి విందులో గొడవ

2 Mar, 2015 23:34 IST|Sakshi

హైదరాబాద్: సాఫీగా సాగిపోవాల్సిన పెళ్లి విందు కాస్తా రణరంగంగా మారింది. వధువు, వరుడు తరఫు బంధువులు  గొడవకు దిగి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లికార్జుననగర్‌కు చెందిన ప్రసాద్(25), అంబర్‌పేట్ కు చెందిన స్వప్న(23) తొమ్మిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువర్గాల మద్య రాజీ కుదరడంతో ఆదివారం గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో పెళ్లి విందు ఏర్పాటు చేశారు. విందులో ఇరువర్గాల మధ్య మొదలైన చిన్న వివాదం చివరికి గొడవకు దారిసింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. దీంతో సోమవారం ఇరువర్గాల వారు మల్కాజిగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు