హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశంకానున్నారు. సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి కేసీఆర్తో జైట్లీ లంచ్ మీటింగ్లో పాల్గొంటారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రేపు కేంద్ర మంత్రి పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
అరుణ్జైట్లీ శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. బేగంపేట్ విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రిని టీడీపీ ఎంపీ సీఎం రమేష్, టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కలిశారు.