స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు

30 Aug, 2014 14:11 IST|Sakshi
స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు

పాములు చూపించి బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ ముఠా సభ్యులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన దయానీతో పాటు మరో నిందితుడిని కూడా పహాడిషరీఫ్ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు.

స్నేక్గ్యాంగ్ మీద ఇప్పటివరకు ఐదు కేసులు నమోదుచేసినట్లు పహాడిషరీఫ్ పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారం, వ్యక్తిని తీవ్రంగా కొట్టడం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, బెదిరింపుల కేసు, భూ కబ్జా కేసులు ఈ గ్యాంగు మీద నమోదయ్యాయి. కాగా, స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులకు వచ్చేనెల నాలుగో తేదీ వరకు రిమాండ్‌ విధించారు.

మరిన్ని వార్తలు