-
కరోనా ఎఫెక్ట్: భారత్ @ 39
న్యూఢిల్లీ/తిరువనంతపురం/వాషింగ్టన్/బీజింగ్: దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య అనూహ్యంగా 39కు చేరుకుంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఇటలీ నుంచి వచ్చింది. వీరు ఎయిర్పోర్టులో అధికారులకు తప్పుడు సమాచారం అందించి, స్క్రీనింగ్ టెస్ట్ను తప్పించుకున్నారు. అప్పటికే వ్యాధి సోకిన వీరి ద్వారా మరో ఇద్దరికి కరోనా వైరస్ వ్యాపించడంతో కేరళలో బాధితుల సంఖ్య 5 అయింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య (16 మంది ఇటాలియన్లతో కలుపుకుని) 39 అయింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్లతోపాటు, ఝజ్జర్లోని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, పుదుచ్చేరిలోని జిప్మెర్లో ఐసోలేషన్ బెడ్లను ప్రభుత్వం పెంచనుంది. రక్త పరీక్షల కోసం 52 లేబొరేటరీలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. కేరళ ప్రభుత్వం అప్రమత్తం తాజా పరిస్థితులపై కేరళ ఆరోగ్యమంత్రి శైలజ మీడియాతో మాట్లాడారు. పత్తనంతిట్ట జిల్లాకు చెందిన దంపతులు, తమ కుమారుడితో ఇటీవల ఇటలీ వెళ్లారు. వారు దోహా మీదుగా ఇటీవల కోచి చేరుకున్నారు. విమానాశ్రయంలో అధికారులకు తప్పుడు సమాచారమిచ్చి, స్క్రీనింగ్ పరీక్షల నుంచి తప్పించుకున్నారు. అప్పటికే వైరస్ బారిన పడిన వీరి ద్వారా కుటుంబసభ్యులిద్దరికి వ్యాధి సోకింది. సహకరించకపోవడంతో బలవంతంగానే వీరిని ఆస్పత్రులకు తరలించాం. వీరి పరిస్థితి నిలకడగా ఉంది’ అని మంత్రి తెలిపారు. ఇలా ఉండగా, మస్కట్ నుంచి తమిళనాడుకు చేరుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కోవిడ్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. అమెరికా నుంచి చెన్నై వచ్చిన 15 ఏళ్ల బాలుడిలోనూ వైరస్ లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. లాటిన్ అమెరికాలో మొదటి మరణం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బాధిత 95 దేశాలకు చెందిన 3,595 మంది చనిపోగా బాధితుల సంఖ్య 105,836కు చేరుకుంది. చైనా (3,097 మరణాలు, 80,695 కేసులు) ఆ తర్వాత దక్షిణ కొరియా(48 మరణాలు, 7,134 కేసులు), ఇరాన్(194 మర ణాలు, 6,566 కేసులు), ఫ్రాన్సు (16 మృతులు, 949 కేసులు) ఉన్నాయి. అమెరికాలో కోవిడ్తో 17 మంది చనిపోగా 420 కేసులు బయటపడ్డాయి. అర్జెంటీనాలో మొదటి మరణం సంభవిం చింది. బల్గేరియా, పరాగ్వే తదితర దేశాల్లో నూ కోవిడ్ బాధితులను గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెలలో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి కోవిడ్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇటలీ అష్టదిగ్బంధనం ఇటలీలో ఒక్కరోజే 133 మంది మరణించటంతో మృతుల సంఖ్య 366కు చేరుకుంది. అదేవిధంగా మొత్తం కేసులు 5,883 అయ్యాయి. దీంతో ఇటలీ ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపట్టింది. ఉత్తర ఇటలీ ప్రాంతంలోకి ఏప్రిల్ 3వ తేదీ వరకు రాకపోకలను నిషేధించింది. దీంతో దాదాపు 1.50 కోట్ల మందిని దిగ్బంధనంలో ఉంచినట్లయింది. సినిమా హాళ్లు, థియేటర్లు, మ్యూజియంలను మూసివేసింది. పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి కిటికీ నుంచి చేసే ఎంజెలస్ ప్రేయర్ను వాటికన్ సిటీ ఆదివారం లైవ్లో ప్రసారం చేసింది. కూలిన ‘కోవిడ్’ భవనం చైనాలో కోవిడ్ అనుమానితులను ఉంచిన ఆస్పత్రి శనివారం కూలడంతో 10 మంది చనిపోయారు. ఫుజియాన్ ప్రావిన్సు క్వాంగ్ఝౌ నగరంలోని ఓ హోటల్ను ప్రభుత్వం ఆస్పత్రిగా మార్చివేసి అందులో కోవిడ్ అనుమానితులను క్వారంటైన్లో ఉంచారు. 80 గదులున్న ఈ భవనం శనివారం అకస్మాత్తు గా కూలిపోవడంతో 10 మంది చనిపోయారు. సహాయక సిబ్బంది 50 మందిని రక్షించారు. కొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. (చదవండి: కోవిడ్ కేసులు లక్ష పైనే) -
స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు
పాములు చూపించి బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ ముఠా సభ్యులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన దయానీతో పాటు మరో నిందితుడిని కూడా పహాడిషరీఫ్ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. స్నేక్గ్యాంగ్ మీద ఇప్పటివరకు ఐదు కేసులు నమోదుచేసినట్లు పహాడిషరీఫ్ పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారం, వ్యక్తిని తీవ్రంగా కొట్టడం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, బెదిరింపుల కేసు, భూ కబ్జా కేసులు ఈ గ్యాంగు మీద నమోదయ్యాయి. కాగా, స్నేక్గ్యాంగ్ సభ్యులకు వచ్చేనెల నాలుగో తేదీ వరకు రిమాండ్ విధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement