ఎస్సైపై కోడలి ఫిర్యాదు

22 Dec, 2015 07:19 IST|Sakshi
మంచు మోషెస్ బాబు, ఆయన కుమారుడు (ఫైల్ ఫొటోలు)

హైదరాబాద్: కొడుకు నుంచి విడిపోవాలని వేధిస్తున్నారంటూ ఓ ఉన్నతాధికారిపై ఫిర్యాదు చేసింది కోడలు. పోలీస్ శాఖలో రిజర్వ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆ అధికారి పేరు మంచు మోషేస్ బాబు.

 

గత కొంత కాలంగా అత్తమామలు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధిత కోడలు సోమవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. నిందితులపై సెక్షన్ 498ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ అధికారిని అదుపులోకి తీసుకునేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు