డిసెంబర్‌ కల్లా ఇంటింటికీ ఇంటర్‌నెట్‌

26 Mar, 2018 02:57 IST|Sakshi

మండలిలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే డిసెంబర్‌ నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. కోటి కుటుంబాలకు 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

గ్రామాల్లోని పాఠశాలలు, కార్యాలయాలు, పీహెచ్‌సీలకు ఒక జీబీ స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందించి పౌర సేవలను సులభతరం చేస్తామని వెల్లడించారు. ఆదివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు ప్రభాకర్, రామచందర్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు