టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి

29 May, 2016 02:30 IST|Sakshi

తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిష న్ భగీరథ పథకాల్లో ఇంజనీర్లు కమీషన్లు తీసుకుంటున్నారని మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించడంపై తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నేతలు మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఇంజనీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివా రం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద జేఏసీ నేతలు మాట్లాడారు. ప్రజలకు లబ్ధి కలిగించే ఎంతో ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను విజయవంతం చేయడానికి ఇంజనీర్లు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు