కాంగ్రెస్ పార్టీకి కె ఎం ప్రతాప్ రాజీనామా

18 Dec, 2015 13:17 IST|Sakshi

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె.ఎం. ప్రతాప్ ప్రకటించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్లోని నివాసంలో ప్రతాప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా మారిందని ఆరోపించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కె ఎం ప్రతాప్ పని చేసిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కె ఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు