నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని

11 Jul, 2016 19:08 IST|Sakshi
నిందితులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి తలసాని

హైదరాబాద్: పంజాగుట్ట కారుప్రమాదానికి కారణమైన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కేబీఆర్ పార్క్ వద్ద సోమవారం సాయంత్రం రమ్యకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ...రమ్య కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. చిన్నారి కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి...న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. రమ్య కుటుంబసభ్యులు మాట్లాడుతూ... ఈ ప్రమాదం కారణంగా మొత్తం కుటుంబాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరారు. ఈ ర్యాలీలో రమ్య కుటుంబసభ్యులు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గాయని శోభారాణి, నటుడు కాదంబరి కిరణ్, శివాజీ, మంచు లక్ష్మీ, గజల్ శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు