రంజీట్రోఫీ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్

17 Feb, 2015 21:30 IST|Sakshi

రోహతక్ : 2014-15 జాతీయ రంజీట్రోఫీ క్రికెట్ పోటీల్లో భాగంగా జరిగుతున్న మ్యాచ్ లో మహారాష్ట్ర మొదటి ఇన్నింగ్స్ లో91పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్ 28, శ్రీరాం 31, ఏజి ప్రదీప్ 27 పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో సంక్లేచ 45 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. మరో బౌలర్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఖండేలవాల 47 పరుగులు చేశాడు. కెఎం జాదవ్ 81బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆంధ్ర జట్టులో శివకుమార్ 54 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరో బౌలర్ స్టీఫెన్ 31 పరుగులిచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మరిన్ని వార్తలు