ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ ఫీజు గడువు పెంపు

28 Feb, 2017 01:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు మార్చి 8లోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది. ఒక్కో పేపరుకు రూ. 25 ఆలస్య రుసుముతో 9 నుంచి 13వ తేదీ వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొంది.

ఫీజును మీసేవా/ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లోనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్సెస్సీ పరీక్ష కోసం ఒక్కో పేపరుకు రూ. 100, ఇంటర్‌కు ఒక్కో పేపరుకు రూ. 150 చెల్లించాలని సొసైటీ డైరెక్టర్‌ వెంకటేశ్వరవర్మ వెల్లడించారు.

మరిన్ని వార్తలు