రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృత్యువాత

19 Dec, 2016 10:28 IST|Sakshi

హైదరాబాద్: దమ్మాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని బైక్‌పై నాగారంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా స్థానిక చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న అఖిల(15) అనే బాలిక అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు