ఫిలింసిటీ నిర్మిస్తే ఆత్మహత్యలు ఆగవు: స్వామి అగ్నివేశ్

10 Jan, 2015 18:00 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై స్వామి అగ్నివేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలింసిటీ నిర్మిస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగవని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో శుక్రవారం జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి అగ్నివేశ్తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, సాక్షి ఈడీ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు