పోలీసులకు యువత సాయం

15 Sep, 2016 19:44 IST|Sakshi

ఏడాదికి ఓసారి వచ్చే గణేష్ నిమజ్జనంలో ఎంజాయ్ చేయడమే కాదు... పోలీసులకు సహకరిస్తామంటూ ముందుకు వచ్చారు గడ్డిఅన్నారం ప్రాంతానికి చెందిన బాడీబిల్డర్స్. సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు ఇచ్చిన స్ఫూర్తితో ‘ది ఇండియన్ జిమ్’ నిర్వాహకుడు కె.రవీందర్‌రెడ్డి స్థానిక యువతను కూడగట్టారు. ఆయన నేతృత్వంలో 40 మంది యువకులు నిమజ్జనం నేపథ్యంలో పోలీసులకు సహకరించడానికి ముందుకు వచ్చారు. వీరికి ప్రత్యేక పాస్‌లు జారీ చేసిన పోలీసులు సరూర్‌నగర్ ట్యాంక్ వద్ద సేవలకు వినియోగించారు. ప్రధాన నిమజ్జనానికి రెండు రోజుల ముందు నుంచీ పోలీసులతో పాటు డ్యూటీ చేసిన ఈ యూత్ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ నియంత్రణ, విగ్రహాలను లారీల నుంచి దింపి క్రేన్లలోకి ఎక్కించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకూ తోడ్పడ్డారు. రవీందర్‌రెడ్డి సారథ్యంలో ఆరేళ్ల నుంచి ప్రతిసారీ నిమజ్జనం నేపథ్యంలో ఈ తరహా విధుల్లో పాలుపంచుకుంటున్నాయి.

 

మరిన్ని వార్తలు