పండుగ సెలవులకు ఇంటికి వెళ్తూ..

21 Oct, 2015 15:36 IST|Sakshi

ఢోన్: పండుగ సెలవుల్లో ఆనందంగా కుటుంబసభ్యులతో గడపడానికి బయల్దేరిన విద్యార్థులు అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మరి కొద్ది గంటల్లో ఇళ్లకు చేరుకుంటామన్న వారి ఆశలు అడియాసలుగా మిగిలాయి.   

కర్నూలు జిల్లా ఢోన్ మండలం ఒబులాపురం మిట్ట వద్ధ బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. కారులో ఉన్న రిత్విక్, అక్షిత, సమిద్ అక్కడిక్కడే మృతిచెందగా, శశిధర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా హైదరాబాద్‌లోని తార్నాక, కూకట్‌పల్లి  ప్రాంతాలకు చెందిన వారని తెలిసింది. బెంగళూరులో లా చదువుతున్న వీరు పండుగ సెలవులకు కారులో హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించే పనిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు