కూకట్పల్లిలో వాహనాలపై దూసుకెళ్లిన బస్సు

20 Jul, 2016 12:03 IST|Sakshi

హైదరాబాద్ : కూకట్పల్లిలో వాహనాలపైకి బస్సు బుధవారం దూసుకెళ్లింది. ఆ క్రమంలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వారిని సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కూకట్పల్లి నుంచి చందానగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు