హైదరాబాద్ : కూకట్పల్లిలో వాహనాలపైకి బస్సు బుధవారం దూసుకెళ్లింది. ఆ క్రమంలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కూకట్పల్లి నుంచి చందానగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.