'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం!

4 Jan, 2015 19:27 IST|Sakshi
'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం!

హైదరాబాద్: 'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం జరిగింది. కొందరు దుండగులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద ఈ ఘటన జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈరోజు శిల్పకళావేదికపై  'గోపాల గోపాల' ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే.

 ఈ కార్యక్రమానికి  గుంటూరు జిల్లాకు చెందిన  పవన్ కల్యాణ్ అభిమాని కన్నా శ్రీనివాస్ వచ్చారు.   శ్రీనివాస్ శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి పరారయ్యారు.  తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

మరిన్ని వార్తలు