హైదరాబాద్: 'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద దారుణం జరిగింది. కొందరు దుండగులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద ఈ ఘటన జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈరోజు శిల్పకళావేదికపై 'గోపాల గోపాల' ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని కన్నా శ్రీనివాస్ వచ్చారు. శ్రీనివాస్ శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.