వాటర్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

15 Nov, 2015 14:49 IST|Sakshi

వాటర్ ట్యాంకర్ ఢీకొని హైదరాబాద్ లోని కాచిగూడ చౌరస్తాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సయ్యుద్దీన్‌అలీ (40) చౌరస్తా సమీపంలో కేడీఆర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా... వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అతడిని  ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అలీ అక్కడే మృతి చెందాడు. పోలీసులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రఫీని అదుపులోకి తీసుకున్నారు.

 

మరిన్ని వార్తలు