5 ఓట్ల విజేత..

6 Feb, 2016 01:29 IST|Sakshi
5 ఓట్ల విజేత..

జాంబాగ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. ఆనంద్ కుమార్ గౌడ్‌పై మజ్లిస్ అభ్యర్థి డి. మోహన్ స్వల్ప తేడాతో విజయం సాధించారు. మోహన్‌కు 8,583 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్‌కు 8,578 ఓట్లు పోలయ్యాయి. కేవలం 5 ఓట్ల తేడాతో మజ్లిస్ అభ్యర్థి మోహన్ విజయం సాధించారు.

టీడీపీ అభ్యర్థి భజరంగ్ శర్మకు 5,235 ఓట్లు రాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి ఎం. ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ 3,382 ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.                             - అబిడ్స్
 

మరిన్ని వార్తలు