దంపతులపైకి దూసుకెళ్లిన టిప్పర్: భార్య మృతి

6 Jun, 2015 08:19 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని నాగోలులో శనివారం టిప్పర్ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న టిప్పర్ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ క్రమంలో భార్య మృతి చెందింది. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు