స్నేహితురాలి ఇంట్లో పూజకని వెళ్లి..

6 Sep, 2016 15:35 IST|Sakshi

సికింద్రాబాద్: ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... సౌత్ లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన శాలిని(23) ఈ నెల 4వ తేదీన బర్కత్‌పురలో ఉండే తన స్నేహితురాలి ఇంట్లో పూజ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది.

శాలిని రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితులను వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. చేసేది లేక లాలాగూడ పోలీసులను మంగళవారం ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు