హైదరాబాద్: సెల్టవర్ను తొలగించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. తుకారాం గేట్ వద్ద ఉన్న టవర్ పైకి బుధవారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు ఎక్కారు. అక్కడ అమర్చిన పరికరాలను ధ్వంసం చేశారు. టవర్ తొలగించకుంటే కిందికి దూకుతామని బెదిరించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.