ఈజిప్టులో ప్రమాదం, 16మంది భారతీయులకు గాయాలు

29 Dec, 2019 08:26 IST|Sakshi

కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐన్ సోఖ్నా సమీపంలో 16 మంది భారత పర్యాటకులు  బస్సు ప్రమాదానికి గురయ్యారని కైరోలోని భారత రాయబార కార్యాలయం శనివారం తెలిపింది. ఈజిప్టులోని ఓ ఆన్‌లైన్‌ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టగా అనూహ్యంగా వేనకాలే వస్తున్న మరో బస్సును ట్రక్కు ఢీకొట్టింది. పలువురు గాయపడగా, ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఓ భారతీయుడు, ఇద్దరు మలేషియా దేశస్తులు, ముగ్గురు ఈజిప్టుకు చెందిన వారున్నారు. 

క్షతగాత్రులను సూయోజ్, కైరో ఆసుపత్రులలో చేర్పించారని అధికారులు తెలిపారు. ఎంబసీ అధికారులు... సంఘటనను పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పర్యాటకుల సమాచారం కొరకు రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఇచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు + 20-1211299905, +201283487779 అందుబాటులో ఉన్నాయని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేరిట ట్వీట్‌ చేశారు.

 

మరిన్ని వార్తలు