అంకారా : ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో దాదాపు 18, 632 మంది ఉద్యోగులను(పోలీసు అధికారులు, సైనికులు) టర్కీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు ఓ అత్యవసర సర్క్యూలర్ను ఆదివారం టర్కీ ప్రభుత్వం జారీ చేసింది.
రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మిలటరీ కుట్రలో ఈ ఉద్యోగులు పాల్గొన్నారు. 8,998 మంది పోలీసు అధికారులు, 3,077 సైనికులు, 1,126 నావల్ అధికారులు, 1,052 సివిల్ సర్వెంట్లు, 199 అకాడమీషియన్లు ఇందులో ఉన్నారు.
కుట్రతో సంబంధం ఉన్న మూడు న్యూస్ పేపర్లను, టెలివిజన చానెల్ను, 12 అసోసియేషన్లను కూడా టర్కీ ప్రభుత్వం మూసేసింది. కొద్దిరోజుల క్రితం మరోమారు మిలటరీ కుట్రను తిప్పికొట్టింది. ఇప్పటికే కొనసాగుతున్న అత్యవసర పరిస్థితిని ఈ నెల 19 వరకూ పొడిగించారు.