బీజింగ్ : బొగ్గు గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ ఘటన ఉత్తర చైనాలోని షాంజ్జీ ప్రావిన్స్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా గురువారం వెల్లడించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో129 మంది ఉన్నారని పేర్కొంది. మిగిలిన వారంతా సురక్షితంగా బయటకు వచ్చినట్లు తెలిపింది.