నేపాల్లో మరోసారి భూ ప్రకంపనలు

15 May, 2015 12:42 IST|Sakshi

కఠ్మాండు: వరుస భూకంపాలతో కకావికలమవుతోన్న నేపాల్ లో శుక్రవారం మరోసారి భూమి కంపించింది. రాజధాని కఠ్మాండుకు 52 కిలోమీటర్ల దూరంలోని ధదింగ్ జిల్లా కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయినట్లు నేపాల్ జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం చీఫ్ లోక్ బిజయ అధికారి తెలిపారు.

20 రోజుల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలతోపాటు తరచూ భూమి కంపిస్తుడటంతో నేపాల్ ప్రజలు భయాందోళనలమధ్యే జీవిస్తున్నారు. భూకంపం కారణంగా మరణించినవారి సంఖ్య 8,300కు పెరిగింది. దాదాపు 17 వేల మందికిపైగా గాయపడ్డారు.

మరిన్ని వార్తలు