యూఎస్‌ రక్షణశాఖ కార్యదర్శితో అజిత్‌ ధోవల్‌ భేటి

25 Mar, 2017 09:07 IST|Sakshi
అమెరికా: భారత భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ ధోవల్‌ శనివారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్‌ ఎన్‌. మ్యాటిస్‌ను కలుసుకున్నారు. వాషింగ్టన్‌లో పెంటగాన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఇరు దేశాల భద్రతా విషయాలపై చర్చించారు. ఈ సమావేశానికి భారత అంబాసిడర్‌ నవ్‌తేజ్‌ సర్నా కూడా హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
మరిన్ని వార్తలు