సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి

14 Oct, 2016 07:22 IST|Sakshi
సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి

డెమాస్కస్: సిరియా - టర్కీ సరిహద్దుల్లోని బద్ అల్ సలమ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు సిరియా తిరుగుబాటుదారులని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు