లెబనాన్లో బాంబు పేలుళ్లు: 20 మంది మృతి

12 Nov, 2015 23:31 IST|Sakshi
లెబనాన్లో బాంబు పేలుళ్లు: 20 మంది మృతి

బీరట్: లెబనాన్ రాజధాని బీరట్ లో గురువారం జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో 20మందికి పైగా మృతిచెందారు. ఈ  విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. రద్దీగా ఉండే దక్షిణ బీరట్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఈ ప్రమాదంలో మరికొంత మంది మృతిచెందినట్లు రెడ్క్రాస్ సొసైటీ అధికారి జార్జ్ కిట్టానె వివరించారు. సిరియాలో ప్రభుత్వంతో పోరాటం సాగిస్తున్న లెబనాన్ మిలిటెంట్ గ్రూపు ఈ ప్రాంతానికే చెందినది కావడం గమనార్హం. సున్నీ మిలిటెంట్ ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు