భయపెట్టిన సబ్‌మెరైన్‌ ఇదే..

27 Jul, 2017 11:48 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద సబ్‌మెరైన్‌ 'ప్రిన్స్‌ ఆఫ్‌ మాస్కో' తీరానికి వచ్చింది. రష్యా నేవీ దినోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు ఈ భారీ సబ్‌మెరైన్‌ నావల్‌ బేస్‌కు చేరుకుంది. నేవీ డే సందర్భంగా భారీగా ఆయుధసంపత్తిని ప్రదర్శించనుంది.

వాస్తవానికి కోల్డ్‌ వార్‌ సమయంలో అమెరికన్లను భయాందోళనలకు గురి చేసింది ఈ సబ్‌మెరైనే. 1359 నుంచి 1389 మధ్య మాస్కోను పాలించిన ద్మిట్రీ డోన్‌స్కోయ్‌ పేరును ఈ సబ్‌మెరైన్‌కు పెట్టారు. దీని పొడవు 520 అడుగులు. ఒక్కసారి సముద్రం లోపలికి వెళితే 120 రోజుల పాటు స్వేచ్ఛగా మనగలదు. టైఫూన్‌ క్లాస్‌కు చెందిన ఈ సబ్‌మెరైన్‌ ఒకేసారి ఇరవై అణు టార్పెడోలను ప్రయోగించ గలదు.

>
మరిన్ని వార్తలు