విజయవాడ: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు విఫలమవుతున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెజవాడ నగరం అభివృద్ధి జరగకపోవడానికి కమ్యూనిస్టు పార్టీలే కారణం.
అభివృద్ధిని అడ్డుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలు ముందుంటాయి. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుంటే పేదల నివాసాలు కులదోస్తున్నామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మహానాడుకు విజయవాడ నుంచి 28 శాతం మంది ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. కుంటి సాకులతో మహానాడుకు రాకపోవడం కరెక్ట్ కాదని అన్నారు