కోటి దాటిన అభిమానం

11 Jun, 2020 00:26 IST|Sakshi

నటిగా, గాయనిగా దక్షిణాదిలోనే కాక బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్‌. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రుతీని ఎంతో మంది అభిమానులు ఫాలో అవుతుంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్స్‌ (కోటీ నలభై లక్షలు) ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నారు శ్రుతీహాసన్‌. ఈ సందర్భంగా ఓ సరదా వీడియోను అభిమానులతో పంచుకుంటూ, ఈ విధంగా రాసుకొచ్చారామె. ‘‘నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా ఇన్‌స్టాగ్రామ్‌ కుటుంబానికి కృతజ్ఞతలు. నేను మీ అందర్నీ ప్రేమిస్తున్నాను. మీరు ప్రతిరోజూ నాపై చూపించే ప్రేమకు చాలా కృతజ్ఞతలు.

చరిత్రలో ఇదొక చాలా వింత సమయం (కరోనాని ఉద్దేశించి). ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం చాలా విచిత్రమైన భావోద్వేగాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌. కాగా లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కనెక్ట్‌ అయ్యారామె. తన రోజు వారి దినచర్యతో పాటు వంట చేస్తున్న వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారామె. అంతేకాదు.. నెగటివిటీని అనుమతించే మానసిక స్థితిలో ఇప్పుడు నేను లేనని, మంచిని మాత్రమే కోరుకుంటున్నానని కూడా పేర్కొన్నారామె. అలాగే ‘చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు’ అనే ఎమోజీలను పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు